Posts

Sri Lakshmi Ganapathi Temple | Ameerpet | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం. ఈ దేవాలయం తెలంగాణా లోని హైదరాబాద్ వద్ద గల అమీర్ పేట వద్ద బిగ్ బజార్ లైన్ లో శ్రీ గణేష్ నగర్ కాలనీ వద్ద కలదు. పంజాగుట్ట ఆఫీసర్ కాలనీ కి మధ్యలో మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలోనే ఈ ఆలయం ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రతి సం || గణపతి నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. ఈ ఆలయం శ్రీ లక్ష్మీ  గణపతి స్వామి కి విశేష పూజలు చేస్తారు. ప్రతి బుధవారం రోజు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం చూడడానికి చిన్నగా ఉన్న కూడా ఈ ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి ఆలయాలు చాలా కొని మాత్రమే ఉంటాయి. ఆలయం బయట ద్వి చక్ర వాహనాలకి మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉన్నది. త్రీ , చతుర్ , ఏ ఇతర భారీ వాహనాలకి పార్కింగ్ సౌకర్యం లేదు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00  #Sri Lakshmi Ganapathi Temple  #Ameerpet  #Hyderabad  #Hindu Temples Guide 

Sri Jain Temple | Medchal | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం పురాతన ఆలయం. హైదరాబాద్ లో చూడవలసినా ఆలయలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం పూర్తిగా తెల్ల రాతితో నిర్మించారు. ఈ ఆలయం సికింద్రాబాద్ నుంచి 25 కి.మీ దూరంలోను మరియు నాంపల్లి నుంచి 35కి. మీ దూరంలో ఉన్నది. ఈ ఆలయం మేడ్చల్ రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా ఉన్నది.  ఈ ఆలయం లో సత్రాలు కూడా ఉన్నాయి. ఏసి రూమ్ కొరకు 700/- మరియు నాన్ ఏసి రూమ్ 500/- 24 గంటలు మాత్రమే. అవి కూడా కేవలం జైన మతస్థులకి మాత్రమే ఇవ్వబడును. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం లేదు. కేవలం అక్కడికి వెళ్ళి రూమ్ ఉంటే మాత్రమే ఇస్తారు. ఈ ఆలయం మొత్తం తెల్ల రాతి తో నిర్మించడం వల్ల చూడగానే మనస్సుకి ఇట్టే ఆకరసిస్తుంది. ఈ ఆలయం లో 4 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ జైన ఆలయం. పిల్లల కొరకు పెద్ద గ్రౌండ్ కలదు. చాలా పెద్ద ప్రాంతం లో ఈ ఆలయం నిర్మించారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 01:30  మధ్యాన్నం : 01:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00  కేవలం సంప్రదాయ దుస్తులలో వస్తే మాత్రమే గుడిలోకి అనుమతి ఇవ్వబడును. శనివారం , ఆదివారం , మరియు ఇతర పండుగల సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది.  #...

Drakshayani Sametha Ramalingeswara Swamy | Medchal | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం సుమారు 300 సం || కంటే పురాతనమైనది. ఇక్కడ శ్రీ రంగనాయక స్వామి మరియు శివాలయం కలవు. ఈ స్వామి పూర్తి పేరు ద్రాక్షయని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. ఈ ఆలయం తెలంగాణా లోని హైదరాబాద్ వద్ద గల మేడ్చల్ లో కలదు.  ఈ ఆలయం ఒక చిన కొండ మీద కలదు. ఈ ఆలయం లోనికి చేరుకోవడానికి సుమారు 40 మెట్లు ఎక్కాలి. ఈ ఆలయాన్ని శ్రీ రాముల వారు ప్రతిష్ట చేశారు అని అందుకే ఈ ఆలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చినది అని అంటారు. ఈ ఆలయం పక్కనే శ్రీ రంగానాయక స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయం సుమారు 1200 సం || కంటే పురాతనమైనది. ఈ ఆలయానికి చేరుకోవడానికి సికింద్రాబాద్ నుంచి 229 బస్ ఎక్కి మేడ్చల్ లో దిగితే అక్కడి నుంచి ఆటో లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 01:00  మధ్యాన్నం : 01:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Dakshayani Sametha Ramalingeswara Swamy  #Medchal #Hyderabad  #Telangana 

Sri Sai Mukhtidhamam | Shyam Nagar | Shameerpet | Medchal | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తి పేరు శ్రీ సాయి ముక్తిధామం. ఈ ఆలయం మొత్తం రెండు అంతస్థులలో ఉంటుంది. ఈ దేవాలయం తెలంగాణా లోని హైదరాబాద్ వద్ద గల శామీర్ పేట మేడ్చల్ కి మధ్యలో శ్యామ్ నగర్ వద్ద ఉంటుంది.  ఈ ఆలయంలో మొదట శ్రీ గణపతి , శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారు , శ్రీ దత్తాత్రేయ స్వామి తరువాత ప్రధాన దేవత మూర్తి దగ్గరకి వెలుతాము. ప్రతి సం || గురు పూర్ణిమ రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి గురువారం రోజున రద్దీ కొంచం అధికంగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం కాకడ హారతి మధ్యాన్నం మధ్యాన్న హారతి సాయంత్రం సెజ్ హారతి ఇస్తారు.   ఆలయం కూడా కొంచం చిన్నగానే ఉంటుంది. గురు పౌర్ణమి రోజున అన్నదాన ప్రసాద వితరణ చేస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 01:30  మధ్యాన్నం : 01:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు  కేవలం సంప్రదాయం దుస్తులలో వచ్చిన వారికి మాత్రమే దర్శనం కి అనుమతి ఇవ్వబడును. ప్రత్యేక పండుగల సమయంలో ఆలయ రద్దీ ని దృష్టిలో ఉంచుకొని దర్శన సమయంలో ఆ రోజులలో మార్పులు ఉంటాయి. భక్తులు సహకరించగలరు. ద్వి చక్ర వాహనాల పార్కింగ...

Shameerpeta Sri Dongala Maisamma Temple | Shameerpeta | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ అమ్మవారి ఆలయంకి పెద్ద చరిత్ర ఉన్నది. ఈ ఆలయం సరిగ్గా తెలంగాణా లోని సికింద్రాబాద్ వద్ద గల శామీర్ పేట ఓ ఆర్ ఆర్ కి ముందే ఉంటుంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి సరిగ్గా 18కి. మీ దూరంలోనే ఉంటుంది.  ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ కేవలం ధర్మబద్దమైన కోరికలు నేరవెరతాయి అని భక్తుల నమ్మకం. పూర్వం ఇక్కడ దొంగలు కూడా అమ్మవారి సన్నీది లో మొక్కుకొని దొంగతనాలు చేసే వారు అని తెచ్చిన డబ్బులు కొంచం ధర్మంగా ఖర్చు చేసే వారు తద్వారా ఈ ఆలయానికి దొంగల మైసమ్మ అని పేరు వచ్చింది. కానీ దీనితో మారియొక్క కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నది. పూర్వం మోటారు సైకిల్ కూడా లేని సమయంలో అనగా కేవలం ఎడ్ల బండ్లు ఉన్న సమయంలో వేరే ప్రాంతానికి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళితే ఆ ఇంటిలో దొంగలు పడకుండా ఉంటుండే అని ఆ ఇంటిని ఈ అమ్మవారు కాపాడుతూ ఉంటుంది అని మరి కొందరి భక్తుల నమ్మకం. ఆదివారం శుక్రవారం రద్దీ అధికంగా ఉంటుంది. ఆషాడ మాసంలో ఇక్కడ అమ్మవారికి చాలా పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పిస్తారు. కరీంనగర్ , సిద్దిపేట , సిరిసిల్ల , గజ్వేల్ నుంచి కూడా భక్తులు వస్తారు. కానీ ఈ ఆలయం మనం అనుకు...

Maddimadugu Hanuman Temple | Telangana | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం తెలంగాణా చివరి గ్రామంలో నల్లమల లో ఉన్నది. సరిగ్గా మద్ది మడుగు అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం పూర్తి పేరు మద్ది మడుగు పబ్బతి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అని  అంటారు. పబ్బతి అంటే ప్రసన్న, శాంతమూర్తి అని అర్ధం.   అమ్రాబాద్ నుంచి 45 కి మీ దూరంలో మరియు ఇప్పలపల్లి నుంచి కేవలం  10 కి. మీ దూరంలో నల్లమల  లోతట్టు, అటవీ ప్రాంతంలో స్వామివారు స్వయంగా వెలిశారు. చైత్ర శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసాలలో మరియు శ్రీ హనుమాన్ జయంతి శ్రీ రామనవమి ప్రత్యేక పండుగల సమయంలో  ఇక్కడ స్వామి వారికి  ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.ఇక్కడ స్వామి వారికి బెల్లం , గోధుమ రొట్టెలతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని నివేదన చేస్తారు. వడ మాల ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ స్వామి వారికి మంగళవారం , శనివరం ప్రత్యేకంగా తమలపాకులతో అర్చన చేస్తారు. ఈ ప్రాంతం హైదరాబాదుకు 185 కి.మీ, మహబూబ్‌నగర్‌కు 145 కి.మీ  అచ్చంపేటకు 70కి.మీ దూరంలో ఉన్నది. ఈ ఆలయం నుంచి శ్రీశైలం కి కేవలం 130 కి. మీ దూరంలోనే ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 01:00  మధ్యాన్నం : 01:00 నుంచి 03...

Sri Ram ghat Hanuman Temple | Gowliguda | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం నిర్మించిన వారు కేవలం ఒకే ఒక వ్యక్తి అంటే నమ్ముతారా? అవును ఈ ఆలయాన్ని నిర్మించినది ఒకే వ్యక్తి.  ఆ రోజు నిర్మించిన ఆలయమే నేడు మీరూ చూస్తున్న ఈ ఆలయం.  ఈ ఆలయాన్ని మొదట రామయ్య  అనే ఇద్దరు 1956 సం || లో ప్రారంభించారు. ఈ ఆలయం అప్పటి మంచినీటి కాలువా లాగా ప్రవహించే మూసి నది పక్కనే ఉన్నది. కొని సం|| ల తరువాత ఆ ఆలయం పూర్తిగా శిధిలావస్థకి చేరుకున్నది. 2018 వ సం || లో మళ్ళీ ఈ ఆలయాన్ని పునః నిర్మించాలి అని సంకల్పంతో ప్రారంభించారు. ఇప్పుడు ఒక పెద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. ఈ ఆలయంలో శివాలయం కూడా ఉన్నది. హనుమాన్ జయంతి రోజున మరియు శ్రీ రామనవమి రోజున రద్దీ చాలా అధికంగా ఉంటుంది. హనుమాన్ శోభయాత్ర కూడా ఇక్కడ చాలా బాగా నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00  ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ మాత్రమే ఉన్నది. దానికి కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీద ఉండడమే. కేవలం సంప్రదాయ దుస్తులలో మా...