Posts

Sri Ardha Nareeswara Temple | Kondapur | Hyderabad | Telangana

Image
  జీవితంలో ఒక్కసారి ఐన ఈ ఆలయాన్ని దర్శించి తిరవలసిందే. ప్రపంచంలో ఇలాంటి ఆలయాలు ఉండడం చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి ఆలయం మన తెలంగాణ హైదరాబాద్ లో ఉండడం మన అందరికీ గర్వ కారణం. తెలంగాణా మొత్తం మీద ఇలాంటి ఆలయం కేవలం ఒకే ఒక్కటి ఉన్నది. అది మన హైదరాబాద్ లో ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని కొండాపూర్ వద్ద శిల్ప హీల్స్ కొత్త గూడ వద్ద ఉన్నది.  ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ ఇక్కడ శివుడు మరియు అమ్మవారు ఒకటే పీఠం మీద ఒకటే రూపంతో దర్శనం ఇస్తారు. ఇక్కడ ఆలయం సుమారు 12వ శతాబ్దం లో శ్రీ కాకతీయుల కాలంనాటి రూపంతో ఉంటాయి. ఈ ఆలయంలో మొదట పెద్ద ప్రారంభ గోపురం దర్శించుకొని లోనికి వెళితే రాతితో నిర్మించిన ధ్వజా స్తంభం దర్శించుకొని ఉప ఆలయాల దర్శనం తరువాత ప్రధాన ఆలయం లోనికి ప్రవేశించాలి. చెట్టు కింద పెద్దమ్మ తల్లి దర్శించుకోవాలి. తరువాత శ్రీ హేమలంబ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం చుట్టూ అనేకమైన దేవత మూర్తుల విగ్రహాలు దర్శించవచ్చు.  ఈ ఆలయం తరువాత ప్రధానమైన ఆలయంలోనికి ప్రవేశించాలి. ఇక్కడ ఒకే శిలా మీద శ్రీ పార్వతి పరమేశ్వరుల ఏక రూపంతో అర్ధనారీశ్వర రూపం తో దర్శనం ఇస్తారు. దసరా , దీపావళి ,...

Sri Goda Ranganatha Swamy Temple | Thorrur | Hayatnagar | Hyderabad | Telangana

Image
  ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. ఇక్కడ స్వామి కొండలలో వెలిసి ఉంటారు. ఆ కొండనే శ్రీ గోడ రంగనాధ స్వామి ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని హయాత్ నగర్ వద్ద గల తొర్రూర్ గ్రామంలో ఉన్నది.  ఈ ఆలయంలో శ్రీ రంగానాధ స్వామి విగ్రహంతో పాటుగా కొండలో నుంచి బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది. పైన ఉన్న ఫోటోలో స్వామి ని దర్శించవచ్చు.  ఈ ఆలయంలో శ్రీ రంగానాధ స్వామి తో పాటుగా శ్రీ గణపతి , శ్రీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఈ స్వామి వైకుంఠ ఏకాదశి రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. ఆలయం లోపల విపరీతంగా వేడిగా ఉంటుంది. ఈ స్వామిని ఇక్కడ ఎవరు ప్రతిష్ట చేయలేదు. ఈ స్వామి స్వయంభూ స్వామి.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు  #Sri Goda Ranganatha Swamy Temple  #Thorrur  #Hayatnagar  #Hyderabad  #Telangana 

Sri Gantala Shanishwara Swamy Temple | Madanapalle | Shamshabad | Hyderabad

Image
  ప్రపంచంలో ఉండే అతి కొద్ది ఆలయలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇలాంటి ఆలయాలు మనకి అధికంగా అస్సలు కనిపించవు. ఈ ఆలయం హైదరాబాద్ లోని శంషాబాద్ వద్ద గల మదనపల్లి అనే గ్రామంలో ఉన్నది.  ఈ ఆలయం చాలా ప్రత్యేకమైన ఆలయం. ప్రపంచం లో ఎక్కడ లేనటు వంటి విధంగా ఇక్కడ శ్రీ గంటల శనైచ్చర స్వామి కొలువై ఉంటారు. ఈ ఆలయంలో ప్రవేశించగానే మొదట శ్రీ శివాలయంని దర్శించుకోవాలి. తదుపరి శ్రీ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. తరువాత ప్రధాన ఆలయంలోనికి ప్రవేశిస్తాము. ఇక్కడ శ్రీ శని దేవుడు ప్రధాన దేవత మూర్తిగా పూజలు అందుకుంటున్నారు. అని ఆలయలలోగా కాకుండా ఇక్కడ కొంచం వేరే విధంగా ఇక్కడ పూజలు ఉంటాయి. అబ్బాయిలు ఐతే అంతరాలయ ప్రవేశం ఉంటుంది. అది కూడా పైన చొక్కా లేకుండా వెళ్ళాలి. శిరిడీ వద్ద గల శని ఆలయం వలె. శని త్రయోదశి రోజు ప్రత్యేక పూజలు ఉంటాయి. ఇక్కడ స్వామి కి తైలాభిషేకం విశేషంగా చేస్తారు. ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 03:30 బ్రేక్  సాయంత్రం : 03:30 నుంచి 08:00 వరకు    #Sri Shanishwara Swamy Temple  #Madanapalle  #Shamshabad  #Hyderabad 

Karnataka Bharat Gaurav Kashi Darshana Yatra | IRCTC

Image
  భారత ప్రభుత్వ సహాకారం తో నడుపుతున్న irctc ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంతో కూడా తోడ్పడి కొత్తగా ఒక యాత్ర ప్రారంభించారు. దానికి కర్ణాటక భారత్ గౌరవ కాశీ దర్శన యాత్రగా పేరు పెట్టారు.   యాత్ర యొక్క వివరాలు : యాత్ర పేరు : కర్ణాటక భారత్ గౌరవ కాశీ దర్శన యాత్ర  యాత్రకి పట్టే సమయం : 08రాత్రులు /09 పగల్లు  ప్రయాణం ప్రారంభ తేదీ  : 20/05/2025  టూర్ ధర : రూ|| 22,500/- ఒక్కరికీ  ప్రత్యేక ఆఫర్ : రూ || 7,500/- కర్ణాటక ప్రభుత్వం సబ్సిడీ  లభిస్తుంది.  టూర్ వివరాలు : బెంగళూరు - వారణాసి - అయోధ్య - గయా - ప్రయాగ్ రాజ్ - బెంగళూరు  రైలు ఎక్కే పాయింట్స్ : smvb బెంగళూరు , తుమ్ముకురు , బిరుర్ , దేవన్ గిరి , హవేరి , హుబలి మరియు బెల్గాం.    ఈ యాత్రలో దర్శించే ప్రాంతాలు :   వారణాసి : తులసి మానస్ ఆలయం , సంకట్ మోచన హనుమాన్ ఆలయం , కాశీ విశ్వనాథ్ ఆలయం , గంగా హారతి.  అయోధ్య : రామ జన్మభూమి  గయా : విష్ణుపాడ్ మరియు మహాబోధి ఆలయం.  ప్రయాగ్ రాజ్ : హనుమాన్ ఆలయం మరియు పవిత్ర నదీ స్నానం.  టూర్ యొక్క ఇతర వివరాలు :  మొదటి రోజు -1 :  బెం...

Golden Shivalingam Temple | Rameshwaram | Nagireddypalle | Bhuvanagiri Dist | Telangana

Image
  జీవితంలో ఒక్కసారి ఐన దర్శించాల్సిన ఆలయలలో ఈ ఆలయం ఒకటి. ఇది తెలంగాణా లోని భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి వద్ద కలదు. ఈ ప్రాంతాన్ని రామేశ్వరం అని కూడా మరియొక్క పేరు ఉన్నది. ఈ ఆలయం లో 3 అడుగుల బంగారు శివలింగం ఉన్నది. ఇలా ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం.  ఈ ఆలయాన్ని రామేశ్వరం అని పేరు కూడా ఉన్నది. ఈ ఆలయంలో 1500 పైగా శివలింగలు మరియు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇతర చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 232 జల శివలింగాలు  ఉన్నాయి. వాటికి నిరంతరం ఆ శివలింగల  మీద ఎప్పుడు నీరు పడుతూనే ఉంటుంది. శివ సహస్రంలోని ఒక్కో నామం మీద ఇక్కడ ఒక్కో శివ లింగంని కూడా దర్శించవచ్చును.  మరియు పక్కనే శిరిడీ సాయి బాబా పేరు మీద సాయి బాబా ఆలయం, శ్రీ దుర్గా దేవి ఆలయం కూడా ఉన్నది. శివరాత్రి రోజు ఇక్కడ చాలా పెద్ద రద్దీ ఉంటుంది.  ఇంతటి మహా శివలింగలు ఉన్న ఈ ప్రాంతాన్ని శివశక్తి మహాపీఠం వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మరియొక్క ప్రత్యేకత 9 అడుగుల శ్రీ దుర్గా దేవి ని దసరా సమయంలో విశేష పూజలు నిర్వహించి అమ్మవారి కృపాకు ప్రాతృరులు అవుతారు.  ఇక్కడ 250 కి పైగా దేవి దేవతల విగ్రహాలు కూడ...

Sundara Chaitanya Ashramam | Dundigal | Naguloor Rd | Hyderabad | Telangana

Image
 ఇది ఒక చక్కటి పెద్ద ఆశ్రమం. ఈ ఆశ్రమం హైదరాబాద్ కి 50కి. మీ దూరంలో మరియు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ రోడ్డు కి చాలా దగ్గరలోనే ఉంటుంది. దుండిగల్ అనే గ్రామానికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఆశ్రమం.  సాధారణంగా ఆశ్రమం అనగానే అందరూ పెదా వారు నివసించే ఆశ్రమం అనుకుంటారు. కానీ ఇక్కడ అలా ఏం ఉండదు. ఇక్కడ మధుర , వృంధావన్ మరియు ఇతర చాలా ఆలయాల డెమో , ఊహచిత్రాలు కనిపిస్తాయి. ఇది పేరుకే ఊహ చిత్రాల డెమో కానీ ఇక్కడికి ఒక్కసరి వస్తే అసలైన మధుర , వృంధావన్ లో ఉన్నామా అనే అనుభూతిలో ఉంటాము.  ఇక్కడ అంతా ఒక స్వామిజి పేరు మీద ఈ ఆశ్రమం నడుస్తుంది. ఈ ఆశ్రమంలో ఇతర ఆలయలు ఐన గణపతి , సుబ్రమణ్య స్వామి , శివాలయం , శ్రీమహావిష్ణు ఆలయం , శ్రీ దుర్గా దేవి ఆలయలు ఉన్నాయి. రామాయణం , మహాభారతం , భగవత్గీత లోని సన్నివేశాలను అచ్చు గుద్దినట్టు ఇక్కడ బొమ్మల సహాయంతో చూడవచ్చు. శ్రీ కృష్ణుడు యొక్క అవతారం ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది.  ఆశ్రమ దర్శన సమయం : ఉదయం : 09:00 నుంచి 12:00  మధ్యాన్నం 12:00 నుంచి 03:00 బ్రేక్  సాయంత్రం : 03:00 నుంచి 05:00  పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంత్రం ఇక్కడ అని చూసుకుంట...

Sri Gandimaisamma Temple | Gandi Maisamma X Road | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. కానీ చాలా శక్తివంతమైన అమ్మవారి ఆలయం. ఈ దేవాలయం హైదరాబాద్ లోని గండి మైసమ్మ అనే గ్రామం వద్ద ప్రధాన రహదారికి చాలా దగ్గరలోనే ఉంటుంది. కానీ ఈ అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత కావడం వల్ల ఈ అమ్మవారి పేరు మీదనే ఇక్కడానే 4 ఆలయాలు ఉన్నాయి. అవి కూడా ఇవే పేరుతో ఉన్నాయి.  ఈ ఆలయం నిర్మించి ఇప్పటికి 10 సం || పైనే ఐనది. కానీ అభివృద్ది లో మాత్రం పూర్వం ఈ ఆలయం ఎలా ఉన్నదో ఇప్పటికి ఈ ఆలయం అలానే ఉన్నది. చుట్టూ పక్కల ప్రజల ప్రాంతాల వారు వచ్చి వారు వంతుగా సహాయం చేస్తున్న కూడా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఆలయ అభివృద్ది జరగడం లేదు. కానీ ప్రతి మంగళవారం , ఆదివారం , దేవి నవరాత్రి సమయంలలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00  సాయంత్రం : 05:00 నుంచి 07:30  ఈ ఆలయానికి పెద్ద పార్కింగ్ సౌకర్యం ఐతే లేదు కానీ ఇతర చిన్న చిన్న వాహనాలు మాత్రం నిలుపే సౌకర్యం ఉన్నది.  #Sri Gandimaisamma Temple  #Gandi Maisamma XRoad  #Hyderabad  #Hindu Temples Guide