Posts

Showing posts from August, 2025

Sri Mata Pochamma Devalayam | Manikyamma nagar | Rajendhra Nagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన దేవాలయం. ఈ ఆలయం చాలా చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన దేవాలయం. ఈ ఆలయాన్ని ఇక్కడి భక్తులు సుమారు 25 సం || కంటే ముందు నుంచే కాపాడుతూ ఉన్నారు.  ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంధ్ర నగర్ వద్ద గల మాణిక్యమ్మ నగర్ మరియు అంబేడ్కర్ నగర్ కి మధ్యలో ఉంటుంది. కోఠి నుంచి మరియు మెహింది పట్నం నుంచి ఈ ఆలయానికి బస్ లు  కలవు.  ఈ ఆలయం పూర్తిగా ఇళ్ల మధ్యలో ఉండడం వల్ల ఆలయం కనుకోడం కొంచం కష్టంగా ఉంటుంది. కానీ రాజేంధ్ర నగర్ కి వచ్చి ఏన్ ఐ ఆర్ డి వచ్చిన తరువాత ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రతి సం || ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాల పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి బోనాలు సమర్పించి సాయంత్రం రంగం నిర్వహిస్తారు. ఇందులో ఘటల ఉరేరిగింపు , డప్పు చప్పులు , పోతరాజుల నృత్యాలు , యువతి , యువకుల ఆటలు చాలా ఘనంగా జరుగుతాయి.  బోనాల పండుగ తో పాటుగా ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి దసరా పండుగ కూడా చాలా వైభవముగా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారికి దేవి నవరాత్రులు 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ అలంకరణలు నిర్వహించి ఆన్నదాన ప్రసాద వితరణ నివహ...

Sri Krishna Devasthanam | Budwel | Rajendhranagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 25 సం || కంటే పురాతనమైనది. ఏ విధమైన సహాయ సహకారాలు లేక ఈ ఆలయం ఇప్పుడు శిధిలా వస్తాకి చేరుకున్నది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం కానీ ఇప్పుడు చుటూ పక్కల ఉన్న భక్తుల వల్ల  అభివృద్ది జరుగుతుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంధ్ర నగర్ వద్ద గల బుద్వేల్ కి అతి సమీపంలో ఉన్న కిష్మత్ పూర్ అనే గ్రామానికి ప్రారంభం లోనే ఈ ఆలయం కలదు. చాలా మంది ఈ ఆలయం ముందు ఉన్న రోడ్ మీద నుంచి వెల్లుతున్న కూడా సరిగ్గా గమనించలేరు.  ఈ ఆలయంలో శ్రీ కృష్ణా అష్టమి రోజున విపరీతమైన రద్దీ ఉంటుంది. ఆ రోజున అందరికీ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శ్రీ కృష్ణా స్వామి ఆలయం మాత్రమే కాకుండా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం శివాలయం కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆలయం ఎదురుగా ఉన్న కాలి ప్రాంతంలో రేకుల శేడ్డు నిర్మించారు. అందులో ప్రతి శనివారం మరియు ఆదివారం కొద్ది మంది భక్తులు భజన కార్యకమలు నిర్వహిస్తారు.  ప్రత్యేకముగా కృష్ణాష్టమి , మాస శివరాత్రి , హనుమాన్ జయంతి విశేష పూజలు నిర్వహిస్తారు.   ఆలయ సందర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00 మధ్యాన్నం : 12:00 న...

Sri Mallikarjuna Swamy Devasthanam | Kishan bagh | Attapur | Hyderabad

Image
     ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 50 సం || పైన కంటే ముందు నుంచే ఈ ఆలయం కలదు. ఈ ఆలయం లో ప్రధానంగా శ్రీ మల్లికార్జున స్వామి తో పాటు ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.  ఈ ఆలయం హైద్రాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల కిషన్ బాఘ్ వద్ద కలదు. ఈ ఆలయంలో ప్రతి సం స్వామి వారికి కళ్యాణం మరియు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో  గణపతి స్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. ప్రతి సం || ఈ ఆలాయంలో గణపతి ఉత్సవాలు మరియు శ్రీ ఆంజనేయ జయంతి మరియు దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు.  ఈ ఆలయం అత్తాపూర్ కి చాలా దగ్గర ఉంటుంది. మెహింది పట్నం నుంచి 300 బస్ ఎక్కి హైదర్ గూడ లో దిగి అక్కడి నుంచి ఆటొ లేదా నడక మార్గం ద్వారా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడ దగ్గర లో చాలా చూడదగిన ఆలయాలు ఉన్నాయి.   ఆలయ సందర్శన సమయం : ఉదయం : ఉదయం : 06:00 నుంచి 12:00 మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Mallikarjuna Swamy Devasthanam  #Kishan bagh  #Attapur  #Hyderabad 

Sri Shivanjaneya Swamy Temple | Budwel | Rajendhra Nagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 40 సం || కంటే ముందు నుంచే ఉన్నది. అప్పుడు కొంచం చిన్నగా ఉండేది. భక్తులు కాలక్రమేణా పెరగడం , ఆలయం అభివృద్ది పనులు వేగంగా జరగడం అని చక చక జరిగిపోయినాయి.  ఈ ఆలయం హైదరబాద్ లోని రాజేంధ్రనగర్ వద్ద గా బన్సిలాల్ అనే గ్రామం నికి కిష్మత్ పూర్ అనే గ్రామానికి వెళ్ళే దారిలో బుద్వేల్ అనే గ్రామానికి మధ్యలో ఉన్నది. ఈ ఆలయం సరిగ్గా ఈ మూడు గ్రామాల మధ్యలో ఉన్న బస్ స్టాప్ కి సరిగ్గా వెనుకనే ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రధానంగా శివాలయం మరియు శ్రీ ఆంజనేయ స్వామి ప్రధాన దేవత మూర్తులుగా ఉన్నారు. సోమవారం , మాస శివ రాత్రి  రోజున మరియు మహా శివరాత్రి రద్దీ అధికంగా ఉంటుంది. శనివారం రోజున మరియు హనుమాన్ జయంతి రోజున కూడా రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సం || వినాయక చవితి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. స్వామి pop విగ్రహాన్ని దగ్గరలోనే రాజేంధ్ర నగర్ చెరువు కట్ట వద్ద నిమర్జన్నం చేస్తారు. ఈ ఆలయం లో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.  ఆలయ సందర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00 మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ సాయంత్రం : 04:30 నుంచి 08:30  #Sri Shivanjan...

Sri Uma Ramalingeshwara swamy Temple | Premavathi pet | Shivaram pally | Hyderabad

Image
   ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయన్ని సుమారు 50 సం || కంటే ముందు నుంచే ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ ఉమా దేవి మరియు రామలింగేశ్వర స్వామి ఉన్నారు. ఈ ఆలయంలో మరియొక్క ప్రత్యేకత ఏంటీ అంటే ఈ ఆలయంలో క్షేత్ర పాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు.  ఈ ఆలయం హైదరబాద్ లోని రాజేంధ్రనగర్ వద్ద గల ప్రేమావతి పేట అనే గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయంనికి కొద్ది దూరంలోనే శ్రీ శ్రీ శ్రీ పాండురంగా శివ ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నది. ఈ ఆలయం ప్రధాన రహదారి కి ఎదురుగా ఉండడం వల్ల ఆలయం చాలా తొందరగానే వెళ్లిపోవచ్చు.  ఈ ఆలయంలో  దసరా మరియు శివరాత్రి మరియు శ్రీ ఆంజనేయ జయంతి , గణపతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం చాలా పురాతనమైనది కావున చాలా పాతగా ఉంటుంది. ఈ ఆలయంలో శివభిషేకం , పార్వతి దేవి  ఉమా దేవిగా ఉండి పూజలు అందుకుంటుంది. కోటి నుంచి ఈ ఆలయానికి 95r బస్ ఆరంఘర్ వద్ద దిగి అక్కడి నుంచి ప్రేమావతి పేట కి ఆటొ లో చేరుకోవాలి. అక్కడి నుంచి నడుకుచ్చుకుంటూ కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కేవలం 500మీ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది.  ఆలయ సందర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం ...

Sri Sri Sri Panduranga Shiva Anjaneya swamy Temple | Premavathi pet | Rajendhra Nagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో శివ కేశవులని ఇద్దరినీ ఏక కాలంలో దర్శించుకోవచ్చు. ఈ ఆలయనికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కానీ లోపల ఆలయం మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది.   ప్రతి నెల మాస శివరాత్రి రోజున మరియు మహాశివరాత్రి రోజున విశేష పూజలు మరియు అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మనకి అరుదుగా కనిపించే శ్రీ పాండురంగా స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం హైదరబాద్ లోని రాజేంధ్ర నగర్ వద్ద గల ప్రేమావతి పేట ఏజి‌ కాలేజీ ఆడిటోరియుం కి చాలా దగ్గర ఉంటుంది. ఈ ఆలయం ఈ కాలేజీ కి సమీపంలో ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణం లో ఉన్నట్టు ఉంటుంది. ఈ ఆలయంలో ఇతర చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో మరియొక్క ప్రధాన ఆలయం కూడా ఉన్నది. అదే మన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి శనివారం రోజున స్వామికి విశేష అర్చన మరియు అలంకరణ  జరుగుతుంది. సాయంత్ర సమయంలో ఈ ఆలయ దర్శనం మరియు ఈ కాలేజీ వాతావరణం మనస్సుకు చాలా ప్రశాంతతని కలిగిస్తాయి.  ఆలయ సందర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00 మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ సాయంత్రం : 05:00 నుంచి 08:30 వరకు  Sri Sri Sri Panduranga Shiva Anjaneya s...

Sri kalabhairava Swamy Temple | kishan Bagh | Attapur | Hyderabad

Image
  ఈ‌ ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం. మనం కాశీ యాత్ర చేసినప్పుడు ఏ విధంగా ఐతే శ్రీ కాల భైరవ స్వామి ని మొదట దర్శించుకుంటమో అదే విధంగా మన హైదరబాద్ లో కూడా ఒక కాల భైరవ స్వామి ఆలయం ఉన్నది.  ఈ ఆలయం హైద్రాబాద్ లోని అత్తాపూర్ వద్ద ఉన్న కిషన్ బాఘ్ కి శ్రీ మురళీ మనోహర స్వామీ ఆలయానికి అతి చేరువలో ఉన్నది. మెహింది పట్నం నుంచి బస్ లు మరియు ఆటొ లో హైదర్ గూడ వరకు వచ్చి అక్కడి నుంచి ఆటొ లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. సాధన చేసే వాళ్ళు తప్పకుండ ఈ ఆలయాన్ని సందర్శించాలి.  ప్రతి సారి ఓడిపోతున్న అని అనుకోని ఏం చేయాలి అర్ధం కానీ వాళ్ళు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించుకొని 41 రోజుల పాటు ప్రదోస సమయంలో స్వామి కి అభిషేకం చేయడం వల్ల మంచి జరుగుతుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ నిమ్మకాయ దీపం , గుమ్మడి కాయ దీపం , సొరకాయ దీపం , స్వామి అభిషేకం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయం పూర్తిగా వేరే మాత పరమైన ప్రాంతంలో ఉండడం వల్ల చాలా తక్కువ మంది భక్తులు వస్తున్నారు. మన గుడిని మనమే సంరక్షించుకోవాలి.  #Sri kalabhairava Swamy Temple  #kishan Bagh #Attapur #Hyderabad

Sri Murali Manohar Temple | Kishan bagh | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 300 సం || చరిత్ర కలిగి ఉన్నది. ఈ ఆలయం పేరు శ్రీ మురళీ మనోహర్ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయం లో ప్రధాన దేవత మూర్తి శ్రీ కృష్ణుడు.  ఈ ఆలయం పూర్తిగా ఉత్తర భారత దేశంలో ఉండే శ్రీ కృష్ణుడి ఆలయాల విధంగా ఉంటుంది. ఆ ఆలయంలో చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయం లో చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ద్విచక్ర వాహనాలు కూడా చాలా వరకు లోపలానే పార్కింగ్ చేసుకోవచ్చు. మొదట గణపతి ఆలయం , మరియు హోమ గుండం కూడా ఉన్నది. పక్కనే బాల హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. ఈ ఆలయాన్ని తప్పకుండ చూడాలి.  మరి కొంచం పక్కకి వెళ్ళగానే అక్కడే శివాలయం కూడా ఉంటుంది. ఈ శివలింగం తప్పకుండ చూడాలి. హనుమాన్ ఆలయం మరియు శివాలయం కోనేరు పక్కనే ఉంటాయి. ఆ కోనేరు కి ఈ ఆలయం కింద నుంచే వెళ్ళే మార్గం ఉన్నది. గుండం కూడా చాలా లోతుగా ఉంటుంది.  ఇప్పుడు ప్రధాన ఆలయం విశ్యంలోకి వస్తే ఈ ఆలయంలోని శ్రీ కృష్ణుడు రాజ బహదూర్ అనే వ్యక్తికి కలలో కనిపించి తను ఇక్కడే ఉన్నాను అని మరియు తనకి ఇక్కడే ఆలయం కట్టించమని చెప్పగా ఆ వ్యక్తి దిల్లి నుంచి వచ్చి స్వామి చెప్పిన ప్రాంతం లో చూడగానే మొత్తం రాళ్ళు రప్పలతో ముల్ల అడవి లాగా ఉన...