Sri kalabhairava Swamy Temple | kishan Bagh | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం. మనం కాశీ యాత్ర చేసినప్పుడు ఏ విధంగా ఐతే శ్రీ కాల భైరవ స్వామి ని మొదట దర్శించుకుంటమో అదే విధంగా మన హైదరబాద్ లో కూడా ఒక కాల భైరవ స్వామి ఆలయం ఉన్నది.
ఈ ఆలయం హైద్రాబాద్ లోని అత్తాపూర్ వద్ద ఉన్న కిషన్ బాఘ్ కి శ్రీ మురళీ మనోహర స్వామీ ఆలయానికి అతి చేరువలో ఉన్నది. మెహింది పట్నం నుంచి బస్ లు మరియు ఆటొ లో హైదర్ గూడ వరకు వచ్చి అక్కడి నుంచి ఆటొ లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. సాధన చేసే వాళ్ళు తప్పకుండ ఈ ఆలయాన్ని సందర్శించాలి.
ప్రతి సారి ఓడిపోతున్న అని అనుకోని ఏం చేయాలి అర్ధం కానీ వాళ్ళు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించుకొని 41 రోజుల పాటు ప్రదోస సమయంలో స్వామి కి అభిషేకం చేయడం వల్ల మంచి జరుగుతుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ నిమ్మకాయ దీపం , గుమ్మడి కాయ దీపం , సొరకాయ దీపం , స్వామి అభిషేకం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయం పూర్తిగా వేరే మాత పరమైన ప్రాంతంలో ఉండడం వల్ల చాలా తక్కువ మంది భక్తులు వస్తున్నారు. మన గుడిని మనమే సంరక్షించుకోవాలి.
#Sri kalabhairava Swamy Temple #kishan Bagh #Attapur #Hyderabad

Comments
Post a Comment