Garigutta Peddamma Temple | Shatamrai Village | Shamshabad | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన దేవాలయం. ఇక్కడ అమ్మవారు ఒక పెద్ద గుట్ట కింద వెలిసి ఉంటారు. అందుకే ఇక్కడి భక్తులు ఈ అమ్మవారిని గరిగుట్ట పెద్దమ్మ తల్లి దేవాలయంగా పిలుస్తారు.
ఈ ఆలయం హైదరాబాద్ లోని శంషాబాద్ శాతంరాయ్ అనే గ్రామానికి 02కి.మీ దూరంలోనే ఈ దేవాలయం కలదు. ఈ దేవాలయం చాలా నిర్మానుష్య ప్రాంతంలో ఉండడం వల్ల మరియు గుట్ట మీద ఉండడం వల్ల ఈ ఆలయం సరియైన అభివృద్ది జరుగలేదు. భక్తులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని వారి వారికి తోచిన విధంగా ఆర్ధిక సహాయం తో మెల్లి మెల్లిగా అభివృద్ది చేసుకుంటున్నారు.
ఈ దేవాలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ పెద్దమ్మ తల్లి. ఇక్కడి అమ్మవారికి నాన్ వెజ్ కూడా సమర్పిస్తారు. ప్రతి మంగళ వారం, శుక్రవారం , ఆదివారం రద్దీ కొంచం అధికంగానే ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 03:00 బ్రేక్
సాయంత్రం : 03:00 నుంచి 07:00 వరకే
#Garigutta Peddamma Temple #Shatamrai Village #Shamshabad #Hyderabad

Comments
Post a Comment