Sri Radha Krishna Mandir | Shivaram Pally | NPA | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం సుమారు 35 సంవత్సరాల నుంచి కలదు. పూర్వం ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు కొంచం అభివృద్ది చేశారు. ఈ ఆలయానికి చాలా మంది ఉత్తర భారత భక్తులు రావడం ఇక్కడి ప్రత్యేకత.
ఈ ఆలయం హైదరబాద్ లోని శివరాం పల్లి వద్దగల నేషనల్ పోలీసు అకాడమీ కి ఎదురుగా మరియు సరిగ్గా మహేశ్ విధ్య భవన్ అనే స్కూల్ కి పక్కనే కలదు. ప్రతి రోజు ఉదయం కొద్ది మంది పిల్లలు ఈ స్వామి దర్శనం చేసుకుంటారు.
ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. సాయంకాల సమయంలో ఈ ఆలయం దర్శించడం మంచిది.
ఈ ఆలయంలో అందమైన శ్రీ రాధా కృష్ణ విగ్రహాలతో పాటుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , శివాలయం , ప్రత్యేకమైన నవగ్రహ ఆలయం , గణపతి ఆలయం కూడా ఉన్నాయి. గణపతి నవరాత్రి పూజలు మరియు దేవి నవరాత్రి పూజలు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:30వరకు
#Sri radha Krishna Mandir #Shivaram Pally #NPA #Hyderabad

Comments
Post a Comment