Kakatiya Trikuteshwara Temple | Mutharam | Bhimadevarpalli | Hanumakonda | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయాన్ని మనం కాకతీయుల కాలం నాటిది అని చరిత్ర . ఈ దేవాలయం వరంగల్ నుంచి కేవలం 35కి.మీ దూరంలో ఉన్నది. మరియు హనుమకొండ నుంచి భీమదేవరపల్లి ముత్తారం అనే గ్రామానికి దగ్గరలోనే ఉన్నది. అప్పటి ప్రభుత్వలు ఈ ఆలయాన్ని సరిగ్గా అభివృద్ది చేయకపోవడం వల్ల శిధిలావస్థ కి చేరుకున్నది.
ఈ ఆలయంలో ప్రధానంగా 3 శివాలయాలు ఉన్నయి. మొదటిది శ్రీ సురేశ్వర ఆలయం, రెండవది మహామృత్యుంజయ ఆలయం, మూడు వాసుదేవ ఆలయం. ఈ ఆలయం పూర్తిగా వరంగల్ లోని వేయి స్తంభాల ఆలయంన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం లో ప్రతి సం || శివరాత్రి ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతాయి. రాత్రి 12 గంటలకి లింగోద్భవం , రుద్రాభిషేకం , అష్ట లక్ష్మీ పూజలు నిర్వహించి మరుసటి రోజు ఉదయ అభీషేక ప్రత్యేక పూజల తరువాత ఆన్నదాన వితరణ ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:45 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:00
ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. కానీ చాలా పురాతన ఆలయం. కేవలం శివరాత్రి మరియు ఇతర పండుగ రోజులలో రద్దీ అధికంగా ఉంటుంది. ఆ సమయంలలో ఆలయ దర్శన సమయంలలో మార్పులు ఉంటాయి అని గమనించగలరు. ఇచ్చట ద్వి చక్ర , త్రీ చక్ర , బస్ ల వంటి వాహణాలకి కి చక్కటి పార్కింగ్ సౌకర్యం ఉన్నాది.
#Kakatiya Trikuteshwara Temple #Mutharam #Bhimadevarpalli #Hanumakonda #Telangana

Comments
Post a Comment