Akkana Sarai Gadi Mohalla | Maheshwaram | Hyderabad | Telangana
ఇది ఒక చారిత్రక కట్టడం. ఇది మన తెలుగువారికోసం కట్టించడం జరిగినది. ఈ ప్రాంతాన్ని అక్కన సరాయి అని పిలుస్తారు. అంటే విశ్రాంతి ప్రదేశం అని అర్ధం. పూర్వం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశాన్నికి ప్రయాణించాలి అంటే గురప్పూ బండ్లు , ఎడ్ల బండ్లు వంటి వి మాత్రమే వాడుకలో ఉండేవి. వాటికి మరియు మనకి విశ్రాంతి తీసుకోవడం కొరకు గాడి మోహల్లా అని పేరుతో నిర్మించారు.
వీటిని నిర్మించినది మన తెలుగు వ్యక్తి. అతనే అక్కన్న మాదన్న మంత్రులు. వీరు అస్సలు వరంగల్ , హనుమకొండ వాసులు అని చరిత్ర. అంచెలు అంచెలుగా ఏది చివరకి గోల్కొండలోని కుతుబ్ రాజు కి మంత్రులుగా ఎదిగినరు. వీరి గురించి ఇప్పటికి గోల్కొండ కోటలోని భక్తరామదాసు ని బంధించిన చెరసాలు ని చూడవచ్చు. వీరు అప్పటి కాలం వ్యక్తులు. అప్పటి కాలం రాజుల కాలంలో కూడా మన వారికోసం విశ్రాంతి గదులని నిర్మించారు. కానీ వీటిని సరిగ్గా పాటించుకొకపోవడం వల్ల నేడు శిధిలావస్థ కి చేరుకున్నది. ఇది ఇప్పటికి శ్రీశైలం వెళ్ళే దారిలో మహేశ్వరం వద్ద చూడవచ్చు. హైదరాబాద్ నుంచి కేవలం 15కి. మీ దూరంలోనే ఈ ప్రాంతం ఉన్నది. అప్పటిలో ఇక్కడ చిన్న చిన్న గుడులు కూడా ఉండేవి అని చరిత్ర.
#Akkana Sarai Gadi Mohalla #Maheshwaram #Hyderabad #Telangana

Comments
Post a Comment