Sri rama alayam | Rambagh | attapur | hindu temples guide
ఈ ఆలయం హైదరబాద్ లోని అత్తాపూర్ అనే గ్రామంలో రాంబాఘ్ నందు కలదు.
ఈ ఆలయం పూర్తిగా రాతి కట్టడం. ఈ ఆలయాన్ని 225 సం || పూర్వమే నిర్మించారు. ఈ ఆలయాన్ని భవానీప్రసాద్ భట్టన్న గారు నిర్మించారు. ఈయన కుమారుడు పెళ్లి వయస్సు వచ్చిన్న తరువాత శరీరం విడిచి పెడుతాడు. ఈ వంశ పురోహితుడు ఆజ్ఞ మేరకు ఈ ఆలయాన్ని నిర్మిస్తారు.
ఈ ఆలయం లో శ్రీ సీత రామ సమేత లక్ష్మణ విగ్రహాలు కలవు. నవమి రోజున ప్రత్యేక కార్యక్రమం లు కలవు. దశమి రోజున ఊరేగింపు ఉంటుంది. ఈ ఆలయంలో ఒకే సారి 1000 మందికి పైగా కూర్చొని భోజనం చేసే అంతా పెద్ద స్థలం కలదు. ఈ ఆలయంలో మారియొక్క ప్రధాన ఆకర్షణ ఆలయ రాతి ధ్వజ స్తంభం. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం 06:00 నుంచి 12:00
మధ్యాన్నం 12:00 నుంచి 4:30 వరకు బ్రేక్
సాయంత్రం 04:30 నుంచి 08;30 వరకు ఉంటుంది.
#Sri rama alayam #Rambagh #attapur #Hyderabad temples #hindu temples guide

Comments
Post a Comment