Posts

Showing posts from June, 2025

Sri Manik Prabhu Shivalayam Temple | Patancheru | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం ముందు చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా పునః నిర్మాణం చేశారు. ఈ ఆలయం తెలంగాణాలోని హైదరాబాద్ లో పటాన్ చెరువు వద్ద కలదు. గోనెమ్మ బస్తి , పోస్ట్ ఆఫీసు కి ఎదురుగా ఉంటుంది.  ఈ ఆలయంలో శ్రీ మాణిక్ ప్రభు తో పాటుగా శివాలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , శ్రీ దుర్గా దేవి ఆలయం కూడా ఉన్నాయి. శివరాత్రి ఉత్సవాలు , మరియు శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ జయంతి , దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 01:00  మధ్యాన్నం : 01:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00  #Sri Manik Prabhu Shivalayam Temple  #Patancheru  #Hyderabad  #Telangana 

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈలాంటి దేవాలయం ప్రపంచంలో ఎక్కడ లేదు. అంతటి గొప్ప దేవాలయం మాన ఈ దేవాలయం. ఇంతటి గొప్ప దేవాలయం మన తెలంగాణాలో ఉండడం మన అందరి అదృష్టం. ఈ ఆలయం లో స్వామి ఒకే రాతి పై పక్క పక్కనే రెండు శివలింగములుగా దర్శనం ఇస్తారు. ఈ ఆలయం తెలంగాణా లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గ్రామంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం గా పిలువబడుతుంది.  ఈ దేవాలయం మొత్తం దట్టమైన అడివిలో , ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతికి చాలా దగ్గరగా ఈ ఆలయం ఉంటుంది. ఈ దేవాలయం పక్కనే సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. గత నెల మే లో 13 నుంచి 26 సరస్వతి నది పుష్కరాలు జరిగినాయి. కొన్ని లక్షల మంది భక్తులు పవిత్ర నదిలో పుష్కరనది స్నానాలు ఆచరించారు. ఈ ఆలయంలో ఒక్క రాతి పై రెండు శివలింగలు దర్శించవచ్చు. ఒకటి ముక్తేశ్వరం మారియొక్కటి కాళేశ్వర స్వామి.  ముక్తేశ్వర స్వామి ని దర్శించుకునంత మాత్రం చేత ముక్తి లభిస్తుంది. దాని వల్ల యమరాజు యమపాశం పడదు అని అంటారు. తరువాత యమధర్మ రాజు శివయ్యని వేడుకోగా అప్పటి నుంచి కేవలం తనని దర్శనం చేస్తుకుంటే యమపాశం పడుతుంది. తప్పకుండా ముక్తేశ్వర స్వామితో పాటు కాళేశ్వర(యమధర్మర...

Sri Raja Rajeshwari Temple | Vemulawada | Siricilla | Telangana | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం తెలంగాణాలోని సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ గ్రామంలో ఉన్నది. తెలంగాణా లోని ప్రసిద్ద ఆలయలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర కలదు.  ఈ ఆలయంలో మనకి విష్ణు , మహేశ్వరులు ఒక్కటే ఆలయంలో దర్శించుకోవచ్చు. అందుకే ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారు. ఈ ఆలయంలో స్వామి నీలలోహిత శివలింగం గా కనిపిస్తారు. ఈ ఆలయం గురించి భవిష్యతర  పురాణం లో ఈ ఆలయం గురించి తెలిపారు.  ఈ దేవాలయాన్ని రాజా నరేంద్ర రాజులు నిర్మించారు అని చరిత్ర. 1992 సం || ఈ ఆలయం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళినది. ప్రతి సోమవారం ఈ ఆలయంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. శనివరం , ఆదివారం , సోమవారం రోజులలో ఈ ఆలయం దర్శనం చేయడం కొంచం ఆలస్యం అవుతుంది. ఈ ఆలయంలో మొదట శ్రీ గణపతి శ్రీ ఆంజనేయ స్వామి , శివాలయం(రాజన్న) , అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి దర్శనం చేసుకుంటాం. ఈ ఆలయం చుట్టూపక్కల చాలా ప్రైవేట్ హోటల్ , సత్రాలు కూడా విశ్రాంతి గదులు కలవు.  ఈ ఆలయం నుంచి బస్ స్టాండ్ కి కొద్ది దూరంలోనే ఉన్నది. నడుచుకుంటూ లేదా ఆటో లో కూడా వెళ్ళవచ్చు. సెలవు రోజులలో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. దర్శనానికి సుమారు...

Bhadra Kali Temple | Warangal | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 165కి. మీ దూరంలోను మరియు వరంగల్ కి 06 కి. మీ  దూరంలోను హన్మకొండ కి  05కి. మీ దూరంలోను ఉన్నది. ఈ ఆలయం వరంగల్ లో చాలా ప్రసిద్దమైన ఆలయం. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ అమ్మవారి దర్శనం కొరకు తెలంగాణా నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు వస్తారు.  ఈ ఆలయాన్ని చాళుక్య  రాజవంశానికి చెందిన రాజు రెండవ పులకేశి 625 CEలో సమైఖ్య రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని వేంగి ప్రాంతంపై తన విజయానికి గుర్తుగా నిర్మించాడని నమ్ముతారు. కాలక్రమంలో ఇప్పుడు వరంగల్ గా మార్పు చెందినది.  పురాణాల ప్రకారం మనకి ప్రధానంగా 108 దేవి ఆలయాలు ఉన్నాయి. అందులో మళ్ళీ 51 ప్రాముఖ్యం ఉండగా మళ్ళీ ఇందులో 18 అష్టదశ శక్తి కేంద్రాలుగా ఉన్నది. ఈ 51 ఉన్న ఆలయలలో ఈ ఆలయం 51వ ఆలయం. ఈ ఆలయంలో దసరా నవరాత్రులు మరియు వసంత నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ తప్పకుండా అమ్మవారికి పసుపు నీటితో జరిగే అభిషేకం తప్పకుండా చూసి తీరాలి. వీటికోసం ప్రత్యేక టికెట్ లు ఉంటాయి. ముందుగా వాటిని తీసుకొవాలి....